నిన్ననే “ఈనాడు” పేపర్లో ఈ వార్త చూసాను. వినాయక చవితి సందర్భంగా జరిగిన సంబరాలలో పాల్గొని విగ్రహారాధన చేసినందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్కు ఈ ఫత్వా జారీ చేయబడింది. మొన్నటికి మొన్న సానియా మిర్జా దుస్తుల విషయంలోనూ ముస్లిం సంస్థలు ఫత్వా జారీ చేసాయి. ఈ విధంగా ముస్లిం సంస్థలు అతివాద, ఛాందస పోకడలు పోతుంటే, హిందువుల పరిస్థితి మరో విధంగా ఉంది. హిందువుల పవిత్ర దేవాలయాలలో కళ్యాణ మహోత్సవాలకూ, బ్రహ్మోత్సవాలకూ పట్టు వస్త్రాలు సమర్పించేవారు హిందువులు కాకపోయినా అడిగేవారు లేకుండా పోయారు. రామసేతు విషయంలో రేగిన దుమారం అందరికీ తెలిసిందే. దీనికి చారిత్రక ఆధారాలు లేకపోయినా, కనీసం సహజ సిద్ధంగా ఏర్పడిన అద్భుతంగా పరిగణించి పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపైన వుంది. ఇలాంటి అద్భుతమే ఏ అమెరికాలోనో ఉంటే ఈ పాటికి ఏ సబ్మెరైన్లలోనో పర్యాటకులను తిప్పి చూపించి ప్రపంచ ప్రాచుర్యం కల్పించేవారు. ఇక ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలలోని నాలుగు మాడ వీధులలోనూ ప్రతిష్ఠించాలనుకొంటున్న స్థంభాల నమూనాను టివిలో చూసాను. అది చూడడానికి అచ్చు శిలువ ఆకారంలో ఉంది. పైన ఎన్ని లతలను, నగిషీలను చెక్కినా దాని సహజ ఆకారం ఎక్కడికి పోతుంది..? టిటిడి వారు మాత్రం ఈ స్థంభాలు విజయనగరం కాలం నాటి సంస్కృతిని ప్రతిబింబించేలా తయారు చేస్తున్నామనీ, దీనిని విమర్శించడం తగదనీ సమర్ధించుకొంటున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఈ మధ్య కాలంలో హిందువుల మనోభావాలను దెబ్బ తీసే సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. మొత్తం మీద, తమ మతాలను పరిరక్షించుకొనే విషయంలోముస్లిములది అతివృష్టి అయితే, హిందువుల పరిస్థితి అనావృష్టిగా తయారయింది.
సల్మాన్ కు ఫత్వా..!!
ఈ టపాని ట్రాకుబ్యాకు చెయ్యడానికి URI: http://trajarao.wordpress.com/2007/09/22/%e0%b0%b8%e0%b0%b2%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95%e0%b1%81-%e0%b0%ab%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be/trackback/
మన హిందూ స్వాములు కూడ ఫత్వా జారీ చేసారు, రాముడు లేదు అని చెప్పిన వారి నాలుక, తల తెస్తె బంగారం ఇస్తామని.
@ VJ,
కావచ్చు. …కాని సల్మాన్ ఖాన్ మీద ఫత్వా జారీ చేయటం …పర మత సహనం లేకపోవటం వలన. ఇక కరుణానిధి మీద ఫత్వా జారీ అయినది…మత ధూషణకు….
బాగా చెప్పారు రాజు పైకం గారూ..,
నేనూ ఇదే వ్యాఖ్య రాద్దామనుకొన్నాను.